Showing posts with label తాజావార్తలు. Show all posts
Showing posts with label తాజావార్తలు. Show all posts

Saturday, May 3, 2014

పేదరాలిపై పైశాచికం

- మెదక్‌ జిల్లా తునికిబొల్లారంలో మరో 'నిర్భయ'కాండ
మూడు రోజులుగా వెలుగుచూడని ఘోర కలి
            అత్యాచారాలకూ మార్కెటు విలువలుంటాయా? అని ప్రశ్నించుకుంటే ప్రతిదీ వ్యాపారమయమైన నేటి సమాజంలో అవుననే అనిపిస్తుంది. రాక్షసత్వాన్ని రచ్చకీడ్చాల్సిన మీడియా స్పందించలేదు. పైశాచికత్వాన్ని ప్రజల ముందుకు తెచ్చి కిరాతకాన్ని కడిగిపారేయేయాల్సిన మీడియా మూగవోయిందెందుకు? ఢిల్లీలో వైద్య విద్యార్థినిపై జరిగిన దారుణ అత్యాచారాన్ని అంతర్జాతీయ స్థాయిలో సంచలనాత్మకం చేసిన మీడియా, రాజధాని హైదరాబాదుకు సమీపంలోని ఓ పల్లెలో ఘోరాతిఘోరంగా జరిగిన సామూహిక అ
త్యాచారాన్ని, అవమానంతో ఆమె ప్రాణాలు తీసుకున్న వైనాన్ని నిలువునా పాతరేసింది. ఈ దుర్యోధన, దుశ్శాసన పర్వంలో ఓ పేదరాలి ఘోషను వినబడకుండా చేసింది. ఎన్నికల జాతరతో హోరెత్తిన మీడియాలో కొన్ని మానవ మృగాలు జరిపిన వికృత క్రీడ వార్త కాకుండా పోయిందా? 'ప్రజాశక్తి, 10టివి' ఈ దారుణాన్ని వెలికి తెచ్చాయి. మెదక్‌ జిల్లా తునికిబొల్లారంలో జరిగిన ఈ ఘోర కలి సమాజానికి తీరని అవమానంగా మిగిలింది.